Given Story:
ఐదేళ్ళ సుదీర్ఘ యుద్ధ పోరాట అనంతరం జయరాం కు
విజయం వరించింది. డిఎస్సీలో క్వాలిఫై అయ్యాడు. టీచర్ ఉద్యోగం ఖాయం. ఆనందంతో తల్లీతండ్రీ
కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు. పోస్టింగ్ ఆర్డరు అందుకుని నీరుగారి పోయాడు జయరాం. "ఉద్యోగం వదులు
కోవాలేమో". " ఏం "
అడిగారు తండ్రి. " అతి కష్టం మీద
ఉద్యోగం వస్తే వదులుకుంటావా " ఆశ్చర్యంగా అంది తల్లి. "
అలమండ లో ఇద్దరు
టీచర్ల స్కూల్లో పోస్టింగమ్మా" " అయితే ..."
"
అక్కడ హెడ్
మాష్టారు రాంబాబు అమ్మా "....
My Conclusion:
“ఎవరూ, మీ సీనియర్ రాంబాబేనా?” అడిగింది తల్లి. “అవును, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు,
వీడెక్కడ దాపురించాడమ్మా!” బాధపడ్డాడు జయరాం. “అయితే మంచిదే! వాడైతే తెలిసిన వాడు గనుక
మేం నిశ్చింతగా ఉండచ్చు. నువ్వేంట్రా శనీశ్వరం లాంటి పాడు మాటలంటున్నావ్ వాణ్ణి?”
తల్లి వారించబోయింది. “నా డీ యస్సీ ఐదేళ్ళు అవడానికి కారణం వాడేనమ్మా!” అన్నాడు
జయరాం బాధగా.